Gold Price Today In Hyderabad: వరుసగా ఐదోరోజు స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పుంజుకున్న వెండి ధరలు

Tue, 25 May 2021-10:11 am,

కరోనా వైరస్ సెకండ్ వేవ్ పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. బులియన్ మార్కెట్‌పై సైతం కోవిడ్19 ప్రభావం చూపడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమల్లో ఉండటంతో కొనుగోళ్లు భారీగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.

Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా ఐదో రోజు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,760గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో యాభై వేల రూపాయలకు చేరిన అనంతరం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా అయిదో రోజు బంగారం స్థిరంగా మార్కెట్ అవుతోంది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,830 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,930 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం

ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రూ.300 మేర పుంజుకోవడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర పెరిగడంతో నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link