Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

Sun, 28 Mar 2021-9:00 am,

Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం పిసిడికి భిన్నంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు క్షీణిస్తున్నాయి.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 28, 2021, ఓ రాశివారికి ధనలాభం

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర పుంజుకుంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.220 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,710కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,900 అయింది.

Also Read: Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా రూ.210 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,050కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వెండి ధర రూ.100 మేర స్వల్పంగా తగ్గడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.64,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. తాజాగా రూ.200 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,300కి పతనమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link