Gold Rate In Hyderabad 01 July 2021: బులియన్ మార్కెట్లో జోష్, పుంజుకున్న బంగారం, వెండి ధరలు

Thu, 01 Jul 2021-12:59 pm,

Gold Rate Today 01 July 2021: బులియన్ మార్కెట్‌లో చాలా రోజుల అనంతరం ఒకేరోజు బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా, ఢిల్లీ పసిడి ధర నిలకడగా ఉంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధర భారీగా పెరగగా, దేశ రాజధానిలోనూ వెండి పుంజుకుంది.

Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు ఇవే

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన అనంతరం బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. తాజాగా రూ.270 మేర బంగారం ధర పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000కు పుంజుకుంది.

Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి ధరలతోనే మార్కెట్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో  స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.45,890కి పతనమైంది.

ఢిల్లీలో బంగారం ధర తగ్గినా, వెండి ధర మాత్రం పుంజుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి రూ.1,100 మేర భారీగా ధర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి రూ.68,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.1,200 మేర వెండి ధర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.74,100 అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link