Golden Chariot Train tour: మహారాజభోగాలతో దక్షిణ బారతదేశ పర్యటన చేయాలనుందా..

Mon, 15 Mar 2021-11:07 pm,

గోల్డెన్ ఛారియట్ ట్రైన్ మార్చ్ 14 నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ ట్రైన్ బెంగళూరు నుంచి ప్రారంభమై..తమిళనాడు, కర్నాటక, కేరళ, గోవా మీదుగా తిరిగి బెంగళూరు చేరుకుంటుంది.

గోల్డెన్ ఛారియన్ ట్రైన్‌కు మరో పేరు గోల్డెన్ రధం కూడా. పేరుకు తగ్గట్టే ఈ ట్రైన్‌ల రాజసం ఒలికించే ఫర్నీచర్, బ్రహ్మాండమైన గదులు, బాత్రూమ్, అద్భుతమైన ఇంటీరియన్ డిజైనింగ్ ఉంటుంది. ట్రైన్‌లో ప్రయాణిస్తూ రాజసం అనుభవించవచ్చు.

కర్నాటక కీర్తిగా ఉన్న గోల్డెన్ ఛారియట్  ఒక ప్యాకేజ్  6 రాత్రులు 7 రోజులు ఉంటుంది. ఇందులో ట్రైన్ బెంగళూరు నుంచి ప్రారంభమై బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, చిక్‌మంగళూర్, హంపి, ఏహోల్, పట్టాడ్‌కల్, గోవా మీదుగా తిరిగి బెంగళూరు చేరుకుంటుంది. రెండవ ప్యాకేజ్  3 రాత్రులు 4 రోజులుంటుంది. ఇందులో బెంగళూరు నుంచి మైసూరు, హంపి, మహాబలిపురం మీదుగా తిరిగి వస్తుంది. 

ఇద్దరు వ్యక్తులండే ఒక కేబిన్ ప్రైస్ 2 లక్షల 8 వేల 90 రూపాయలు మాత్రమే. అటు సింగిల్ పర్సన్‌కు అయితే 1 లక్ష 56 వేల 70 రూపాయలుగా నిర్ణయించారు. అద్దెలో 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా బుకింగ్ చేసుకుంటే రిటర్న్ ఎయిర్ టికెట్  బహుమతిగా లభిస్తుంది.

ఈ రాజసపు ట్రైన్‌ను 2008లో కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. తరువాత దీన్ని ఐఆర్సీటీసీ నిర్వహిస్తూ వచ్చింది. ఈ ట్రైన్  బుకింగ్ అధికారిక వెబ్ సైట్ www.goldenchariot.orgలో వెళ్లి చేయవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link