Glammons Mrs India 2024 award winner: హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన గ్లామన్ మిసెస్ ఇండియా విజేత హేమలత రెడ్డి..

Mon, 14 Oct 2024-2:16 pm,

హైదరాబాద్ లోని ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్ చెరువు, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా  హేమలత రెడ్డి పాల్గొన్నారు

జెమినీ టీవీ యాంకర్ గా చేసి. ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్ గా  పరిచయమైంది  హేమలత రెడ్డి.  ఇటీవలే ఈమె గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకుంది. అంతేకాదు బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ విభాగాల్లో కూడా అవార్డును అందుకున్నారు.

కాగా బతుకమ్మ పండగ నేపథ్యంలో హైదరాబాదులో చాలాచోట్ల దాండియా వేడుకలు భారీగా జరిగాయి.  అందులో హీరోయిన్ హేమలత రెడ్డి ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ నివసించే వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్ చెరు, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు హేమలత రెడ్డి.

గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన తర్వాత ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్లో  అందరూ ఆమెని ప్రతిభను ప్రశంసించారు. అదేవిధంగా హేమలత రెడ్డి అందరితో కలిసిపోయి ఎంతో  సరదాగా దాండియా సంబరాల్లో పాల్గొని దాండియా ఆడారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link