Best Tourist Places: విదేశాలను తలదన్నే ఇండియాలోని టాప్ 5 పర్యాటక ప్రదేశాలివే

Thu, 27 Jun 2024-6:35 pm,

మైసూర్ మహారాజా ప్యాలెస్

కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ రాజసానికి, వాస్తుకళకు చిహ్నం. ఫ్రాన్స్‌లోని వైశ్రాయ్ ప్యాలెస్ గుర్తొస్తుంది. మహారాజా ప్యాలెస్ వైభవం చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి లేదు. 

కూర్గ్, కర్ణాటక

కర్ణాటకలోని కూర్గ్‌ను ఇండియన్ స్కాట్లండ్ అంటారు. ఇక్కడ పచ్చదనం నిండుగా ఉంటుంది. అద్బుతమైన అందమైన కొండల మధ్య ఉండే ప్రాంతం. పెద్ద పెద్ద కాఫీ తోటలుంటాయి.

ఔలీ, ఉత్తరాఖండ్

మంచుతో కప్పుకుపోయుండే కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, మనోహరమైన స్కైయింగి రిజార్ట్స్ ఉండే ఔలీ చూస్తుంటే ఎవరికైనా సరే స్విట్జర్లాండ్ గుర్తుకు రావల్సిందే. చల్లని శీతలగాలులు గిలిగింతలు పెడతాయి. స్కీయింగ్ రోమాంచితంగా ఉంటుంది. ట్రెక్కింగ్ అంతకుమించిన ఆనందాన్నిస్తుంది.

జుస్కర్ మఠం, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన పర్వతాలపై ఉన్న జుస్కర్ మఠం టిబెట్ మఠాల్ని గుర్తు చేస్తుంది. బౌద్ధ ధర్మం, సంస్కృతికి సంబంధించిన ఈ మఠంలో టిబెట్ వాస్తుకళ స్పష్టంగా కన్పిస్తుంది. 

మున్నార్, కేరళ

పచ్చని కొండలు, అందమైన లోయలు, పర్వత ప్రాంతాలు, టీ తోటలతో నిండి ఉంటుంది కేరళలోని మున్నార్. స్టాట్లండ్ గుర్తుకు వస్తుంది ఎవరికైనా. నమస్తే చౌక్ నుంచి పనేరరీ దృశ్యాలు చూస్తుంటే యూరప్ హిల్‌స్టేషన్స్ గుర్తొస్తాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link