IPL 2023: మరో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. అత్యధిక పరుగుల వీరులు వీళ్లే..!

Wed, 19 Apr 2023-5:08 pm,

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 228 మ్యాచ్‌లు ఆడి.. 6,844 పరుగులు చేశాడు. (Photo:BCCI/IPL)

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 210 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 6,477 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో ధావన్‌ 2 శతకాలు, 49 అర్ధసెంచరీలు బాదాడు. (Photo:BCCI/IPL)

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ప్లేయర్లలో మొదటిస్థానంలో.. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు 167 మ్యాచ్‌లు ఆడి.. 6,109 పరుగులు చేశాడు. (Photo:BCCI/IPL)  

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు 232 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 6,014 పరుగులతో నాలుగో స్థానానికి చేరాడు. ఐపీఎల్‌లో రోహిత్‌కు ఒక సెంచరీ, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. (Photo:BCCI/IPL)

ఆర్‌సీబీ మాజీ బ్యాట్స్‌మెన్, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,162 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో 3 సెంచరీలు, 40 అర్ధసెంచరీలు నమోదు చేశాడు డివిలియర్స్. (Photo:BCCI/IPL)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link