Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక టెలి సీరియల్ ఏమిటో తెలుసా.. !

Sun, 19 May 2024-3:27 pm,

Jr NTR: అవును జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి మూడో తరం నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు. అంతేకాదు నందమూరి థర్డ్ జనరేషన్‌లో అగ్ర కథానాయిడిగా సత్తా చూపెడుతున్నారు.

తాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో హిందీ వెర్షన్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇందులో బాబాయి బాలకృష్ణ కూడా నటించారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

 

టీనేజీ ఏజ్‌లోనే హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెం. 1' సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నారు.

ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఆది' సినిమాతో హీరోగా తన స్టామినా ఏమిటో చూపించాడు. అటు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు.

ఆ తర్వాత హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. గతేడాది రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు.

అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక టెలి సీరియల్‌లో నటించాడు. ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో 'భక్త మార్కండేయ' సీరియల్‌లో నటించాడు. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ టెలి సీరియల్ టెలికాస్ట్ అయింది.

ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 1 హోస్ట్‌గా.. ఎవరు మీలో కోటీశ్వరుడు హోస్ట్‌గా సత్తా చూపెట్టిన సంగతి తెలిసిందే కదా. త్వరలో దేవర, వార్ 2 సినిమాలలో పలకరించనున్నాడు. అటు ప్రశాంత్ నీల్‌తో  డ్రాగన్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link