Karnataka Elections 2023: కాంగ్రెస్ అభ్యర్థి భార్య కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం చేసి..

Tue, 02 May 2023-3:24 pm,

హోస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్చెగౌడ భార్య ప్రతిభా శరత్ నిత్యం ప్రచారంలో బిజీగా ఉన్నారు. తన భర్త గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.   

హోస్కోట్ నగరంలోని పార్వతీపూర్‌లో ప్రతిభా శరత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా..  కారు అద్దాలు ధ్వంసం చేశారు.  

ఆమె క్రిస్టా కారు సైడ్ గ్లాసులను పగలగొట్టారు. దుండగులను పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నారు.  

సంఘటనా స్థలాన్ని ఎన్నికల అధికారులు, హోస్కోట్ పోలీసులు పరిశీలించారు. అనుమానితులను విచారిస్తున్నారు.   

కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్చెగౌడ భార్య ప్రతిభా శరత్ కారుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link