Keerthy Suresh: కీర్తి సురేష్ ఎందుకిలా మారిపోయింది.. ఆశ్యర్యపోతున్న మహానటి ఫ్యాన్స్..

Wed, 22 May 2024-4:23 pm,

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళ మూవీ 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

 

తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

 

తెలుగులో కాస్త గ్యాప్‌తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్‌.. ప్రస్తుతం 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link