Khairtabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహం చూశారా? శ్రీ సప్తముఖ మహాశక్తి వినయాకుడితోపాటు అయోధ్య రామయ్య..

Sun, 04 Aug 2024-3:14 pm,

అయితే, ఈసారి ఖైరతాబాద్‌ గణేషుడు మరింత ప్రత్యేకం. శ్రీ సప్తముఖ మహాశక్తి వినాయకుడి రూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్‌ 7న రానుంది. అయితే, ఖైరతాబాద్‌లో ఇలా విగ్రహ ప్రతిష్ఠాపన మొదలు పెట్టి 70 ఏళ్లు అవుతుందట. ఈ సందరర్భంగా ప్రతిష్టాత్మక ఖైరతాబాద్‌ వినాయకుడిని కూడా 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.  

గత ఏడాది ఖైరతాబాద్‌ గణేషుడి ఎత్తు 63 అడుగులు, విగ్రహ బరువు దాదాపు 50 టన్నులు 1954 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం దృష్ట్యా ఏర్పాటు చేశారు.  

ఖైరతాబాద్‌ వినాయకుడి నిర్మాణంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు, ముంబై, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విగ్రహాలను రూపొందించేవారు పాలుపంచుకుంటున్నారు.  

ఇప్పటికే విగ్రహం 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ సారి ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహానికి దాదాపు 90 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వారు చెబుతున్నారు.  ఏడు ముఖాలు, ఏడు పాములు, 14 చేతులతో సప్తముఖ మహాశక్తి గణపతి తోపాటు ఈ ఏడాది అయోధ్య బాలరాముడిని కూడా ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే దీని గుర్తుగా శ్రీరాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు.  

విగ్రహం ఇతర ఏర్పాట్లను ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ్‌ కమిటీ చైర్మన్‌ సింగారి రాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. మొదటిరోజు తొలిపూజ తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ రెడ్డి చీఫ్ గెస్టులుగా రానున్నట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link