Lady Aghori: అఘోరీలు శవాలతో సంభోగం చేస్తారా..?.. లేడీ నాగ సాధు మాత చెప్పిన విషయం తెలిస్తే జడుసుకుంటారు..

Sun, 20 Oct 2024-5:06 pm,

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాంను ఒక వర్గానికి చెందని వ్యక్తి కాలితో తన్నుతూ ధ్వంసం చేశారు.ఈ ఘటన తెలంగాణలో పెనుదుమారంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న (శనివారం) సికింద్రాబాద్ లో బంద్ ను సైతం పాటించారు.

ఇటీవల కాశీ నుంచి వచ్చిన అఘోరీ నాగ సాధు మాత ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేశారు. గతంలో ఆమె కొమురవెల్లి మల్లన్న, వేముల వాడలకు సైతం వెళ్లారు . అంతే కాకుండా కీసరకు వెళ్లి శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.  

లేడీ అఘోరీ మాత తెలంగాణలో వచ్చిన నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆమె గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇటీవల పలు ఛానెల్స్ కు ఆమె ఇంటర్వ్యూసైతం ఇచ్చారు. ఈక్రమంలో ఆమె లేడీ అఘోరీ మాతగా ఎలా మారిందో చెప్పారు. ఏడేళ్ల ప్రాయంలో ఆమె కాశీకి వెళ్లిపోయి ఒక తాంత్రిక గురువు వద్ద తాంత్రిక సంబంధ విద్యలు నేర్చుకుని అఘోరీలా మారినట్లు చెప్పింది.

అఘోరీల మారాలంటే.. ఏన్నో ఏళ్లు కఠినంగా ఉండాలని, ఏన్నో సవాళ్లను సైతం ఎదుర్కొవాలని కూడా లేడీ అఘోరీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా..కామ, క్రోధ,కోరికలన్ని తమ ఆధీనంలో ఉంటాయని, పంచభూతాల్ని సైతం తమ ఆధీనంలో ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.

సనాతన ధర్మంకోసం ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని, పర ధర్మంను గౌరవిస్తునే.. మన ధర్మంను కాపాడుకొవాలని కూడా లేడీ అఘోరీ చెప్పారు. అదే విధంగా తనకు ఇప్పుడు యుక్త వయస్సు అని.. ఇతర యువతుల మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆ సమయంలో పూజలు చేయమని , కేవలం స్మశానంలోనే ఉంటామని కూడా చెప్పుకొచ్చింది.

అదే విధంగా.. లేడీ అఘోరీని కొంతమంది అఘోరీలు చనిపోయిన శవాలతో సంభోగం చేస్తారా..?.. అని ప్రశ్నించారు. దీనికి లేడీ అఘోరీ మాత్రం.. ఇలాంటి పనులు నాగసాధులు కానీ, అఘోరీలు చేయరని చెప్పినట్లు సమాచారం. ఇవన్ని కల్పితాలు మాత్రమే అని చెప్పారు. కేవలం చనిపోయిన శవాలను మాత్రం భుజిస్తారని లేడీ అఘోరీ చెప్పినట్లు తెలుస్తోంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link