Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..

Fri, 04 Oct 2024-9:51 pm,

నవరాత్రుల్లో ప్రత్యేకంగా నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా 9 రోజులపాటు దేశవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. అయితే, నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణ దేవి. తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏ అలంకరణ చేస్తారో ప్రతిపాదికన తీసుకుంటారు.  

అన్నపూర్ణాదేవి అలంకరణలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు పూజించేవారు పసుపు,కుంకుమ, అక్షితలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు.  

ఈసారి నవరాత్రుల్లో మూడో రోజు 5వ తేదీ శనివారం రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు అన్నపూర్ణ దేవిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా గంధం రంగులో ఉండే చీరను సమర్పిస్తారు. లేకపోతే పసుపు రంగు చీర కూడా అమ్మకు ఇష్టమే.  

పసుపు అంటేనే దానగుణానికి అర్థం. ఈ అమ్మ అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణ దేవికి నైవేద్యంగా దద్దోజనం పెడతారు. అదేవిధంగా అల్లంతో తయారు చేసిన గారెలు, క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు.  

ఇక దసరా పండుగ ఈ ఏడాది 12వ తేదీ శనివారం రానుంది. నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ ౩న ప్రారంభమయ్యాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link