Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..

Sat, 15 Jun 2024-3:15 pm,

సామాన్యులకు వందే భారత్ మెట్రోలను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వందే మెట్రోని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది.  

ఈనేపథ్యంలో మరికొన్ని నెలల్లోనే వందే మెట్రోని ప్రారంభించనున్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల ,ఐసిఎఫ్ చెన్నైలో సిద్ధమవుతున్నాయి.   

వందే మెట్రోను తొలిసారిగా 2023 ఫిబ్రవరిలో ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఈ రైళ్లను ప్రారంభిస్తున్నారు.  

పాత ఈఎంయూ స్థానంలో ఈ వందే మెట్రోలను ప్రారంభిస్తున్నారు. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వంద మంది కూర్చొని, 200 మంది నిలబడి ప్రయాణించవచ్చు. వందే మెట్రో ట్రైన్ ఎల్సిడి డిస్ప్లేతోపాటు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నాయి.

ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ రైలు యాక్సిడెంట్ కాకుండా కవచ్ అనే సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి.  

తిరుపతి-చెన్నై, ఢిల్లీ-రేవారి, లక్నో-కాన్పూర్, భువనేశ్వర్-బాలాసోర్ వంటి మార్గాలలో వందే మెట్రో నడపవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link