Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ మూవీపై నిధి అగర్వాల్ ఆశలు.. అమ్మడి ఆశలు ఫలించేనా.. !

Mon, 05 Aug 2024-10:53 am,

నిధి అగర్వాల్.. హిందీ చిత్ర సీమలో  టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది.  

 

టాలీవుడ్ లో  చందూ మొండేటి దర్శకత్వంలో  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్. 

నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా దూకుడు మీదుంది. ముఖ్యంగా తమిళ అభిమానులతో నిధికి గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఈమె కెరీర్  ఛేంజ్ అయింది.  

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పలకరించబోతుంది  నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

అటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె ప్రధాన కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై   ఈ అమ్మడు భారీ అంచనాలే పెంచుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link