PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?

Thu, 03 Oct 2024-6:02 am,

పీఎం కిసాన్‌ యోజనలో కీలక మార్పు జరిగింది. బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లను కేటాయించిన కేంద్రం ప్రతి ఏడాది రూ.6 వేలు రైతుల ఖాతాలో మూడు విడతలుగా ఖాతాల్లో జమా చేస్తుంది.  

అయితే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జమ్మూ కశ్మీర్‌లో ఉండే రైతులకు రూ.4 వేలు అదనంగా జమా చేయనుందట. అంటే వారికి రూ.10 వేలు ఏడాదికి అందుతాయి.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు.   

కాగా ఇతర రాష్ట్రాల రైతులకు రూ.6 వేలు ఏడాదికి జమా చేస్తారు. 18 విడుత డబ్బులను అక్టోబర్‌ 5వ తేదీ పీఎం నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. వీరికి రూ.2000 మూడు విడుతలుగా జమా చేయనున్నారు.  

జమ్మూ కశ్మీర్‌లో ఉండే రైతులకు రూ.10 వేలు అంటే రూ.3 వేలు రెండుస్లార్లు రూ.4 వేలు ఒకసారి జమా చేయనున్నట్లు సమాచారం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రూ.2000 జమా అవుతున్న సంగతి తెలిసిందే.  

జూన్‌ నెలలో 17వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.మీరు కూడా పీఎం కిసాన్‌కు అర్హత సాధించాలంటే పీఎం కిసాన్‌ యోజన అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link