PM Modi Nomination: ప్రధాని నామినేషన్లో వెంట ఉన్న ఆ ఇద్దరు ఎవరు.. ?

ప్రధాన మంత్రి ముచ్చటగా మూడోసారి వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసారు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్కు బీజేపీ, ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులతో పాటు పలు మిత్ర పక్షాల నేతలైన బాబు, వపన్ సహా పలువరు నేతలు హాజరు అయ్యారు.

ఇక ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయడానికి తన వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నిలిచారు.
అందులో ఒకరు పండిత్ జ్ఞానేశ్వర్ శాస్త్రి ఒకరు. మరొకరు బైద్యనాథ్ పటేల్ ఉన్నారు. జ్ఞానేశ్వర్ దక్షిణాది ద్రావిడ పండితుడు. అంతేకాదు అయోధ్య రామ మందిరానికి ముహూర్తం పెట్టింది కూడా ఈయనేట. అందుకే ఈయన్ని ప్రధాని తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆయన్ని వెంట తీసుకెళ్లారు.
మరోవైపు బైద్యనాథ్ పటేల్. ఈయన వారణాసిలో బీజేపీ పార్టీ తరుపున సామాన్య కార్యకర్తగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. పార్టీకి నిస్వార్ధంగా చేస్తోన్న సేవలకు గాను ప్రధాని మోదీ ఆయన్ని తన వెంట తీసుకెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి నామినేషన్కు ముందు గంగాదేవి పూజతో పాటు కాశీ విశ్వనాథున్ని, కాల బైరవుడిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత నామినేషన్కు దాఖలు చేసారు.