G20 Summit 2023 Pics: జి20లో ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ ఫోటో సెషన్

Sat, 09 Sep 2023-8:44 pm,

టర్కీ అధ్యక్షుడు తయ్యబ్ ఎర్దెగాన్, ప్రధాని మోదీ భారత్ మండపంలో కలుసుకున్నారు. 

జీ20 సదస్సులో ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్‌సుక్ యోల్‌ను కలుసుకున్నారు. బారత్ మండపంలో ఇద్దరూ కలిసిన ఫోటో ఇది.

ప్రధాని నరేంద్ర మోదీ వెల్‌కం స్పేస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫాను కలుసుకున్నారు.

జీ20 సదస్సులో ప్రదాని మోదీ ఇటలీ ప్రదాని జార్జియో మెలోనీని కలుసుకున్నారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది.

బ్రిటన్ ప్రదాని రుషి సునక్, భారత దేశ ప్రదాని నరేంద్ర మోదీ కలయిక ప్రత్యేకంగా కన్పించింది. ఇరువురి మధ్య చాలా సేపు మాటలయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం సందర్బంగా ఆవేశంగా కన్పించారు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. వెల్‌కం స్పేస్ వెనుక ఉన్న కోణార్క్ చక్రాన్ని జో బిడెన్‌కు మోదీ చూపించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link