PM Modi Letter: అయోధ్యలో ఆతిథ్యమిచ్చిన మహిళకు ప్రధాని మోదీ సర్‌ప్రైజ్.. లెటర్‌లో ఏం రాశారంటే..?

Thu, 04 Jan 2024-12:33 am,

ఇటీవల నరేంద్ర మోదీ అయోధ్య పర్యటనలో భాగంగా.. లతా మంగేష్కర్ చౌక్ సమీపంలోని మీరా మాఝీ అనే మహిళ ఇంటికి వెళ్లారు. తమ ఇంట్లో తయారు చేసిన టీని మోదీకి ఆమె అందించారు.  

కేంద్ర ప్రభుత్వం 2016లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పీఎం ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 10 కోట్లవ లబ్ధిదారుగా మీరా మాంఝీ ఉన్నారు.  

దీంతో మోదీ స్వయంగా ఆమె ఇంటిని సందర్శించారు. తేనేటి విందును స్వీకరించి.. మీరా భర్త సూరజ్‌, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు.  

తాజాగా మీరాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. అంతేకాకుండా మీరా కుటుంబ సభ్యులకు లేఖ రాశారు.   

"మిసెస్ మీరా దేవి జీ, మీకు, కుటుంబ సభ్యులందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ రాముని పవిత్ర నగరమైన అయోధ్యలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కలుసుకోవడం, మీరు తయారుచేసిన టీ తాగడం చాలా ఆనందంగా ఉంది.." అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link