Post Office Scheme: పోస్ట్‌ ఆఫీస్‌ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్‌ ఛాన్స్‌..!

Sat, 19 Oct 2024-1:27 pm,

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకుని దాని ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందాలి అనుకుంటున్నారా? ఈ పోస్ట్‌ ఆఫీస్‌ స్కీమ్‌ అద్భుతం. ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే దానిపై ప్రతినెలా రూ.20,500 వడ్డీ పొందుతారు.  

సీనియర్‌ సిటిజెన్ల కోసం ఈ అద్భుతమైన స్కీమ్‌ను పోస్ట్‌ ఆఫీస్‌ అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.20,000 పొందవచ్చు. దీని మెచ్యురిటీ గడువు ఐదేళ్లు, ఇందులో  మీరు 8.2 శాతం వడ్డీ అందుకుంటారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పథకం ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ అందించడం లేదు.   

భారతీయులు ఎవరైనా సరే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వారి వయస్సు 60 ఏళ్లు దాటినవారు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకాన్ని సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS) అని పిలుస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు ప్రతినెలా ఎక్కువ మొత్తంలో వడ్డీ లభిస్తుంది.  

ఈ ఎస్‌సీఎస్‌ఎస పథకంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అర్హులు. ఒక వేళ ఉద్యోగి అయితే, వారి వయస్సు 55-60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్‌ ఆఫీస్‌ బ్రాంచీలో అయినా అందుబాటులో ఉంటుంది. అక్కడ మీరు మరిన్ని వివరాలు ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు.  

కానీ, ఈ పథకంలో చేరినవారు డిపాజిట్‌ చేసిన డబ్బుపై ట్యాక్స్‌ కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. కొన్ని నిబంధనలతో ట్యాక్స్ తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో గరిష్ట మొత్తంలో మీరు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.  

ప్రస్తుతం ఈ లిమిట్‌ రూ.30 లక్షలకు పెంచారు. ఒక వేళ సీనియర్‌ సిటిజెన్లు ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి వడ్డీ రూ.2,46,000 పొందుతారు. అంటే ప్రతినెలా మీరు వడ్డీ రూపంలో రూ.20,500 అందుకుంటారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link