Raashii Khanna: మరోసారి హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న రాశీ ఖన్నా..

Mon, 05 Aug 2024-11:03 am,

రాశీ ఖన్నా.. నిన్న మొన్నటి వరకు తెలుగులో తనదైన శైలిలో దూసుకుపోయింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు మాత్రం ఎదగలేకపోయింది. అందుకే ఈమె పక్క ఇండస్ట్రీ వైపు చూపులు చూస్తోంది.

2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్‌' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా.

రాశి ఖన్నా.. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపింది.

రాశీ ఖన్నా 'ఊహాలు గుసగుసలాడే' మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు.

జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.

ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.  ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీ చిత్ర పరిశ్రమపైనే ఫోకస్ పెడుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link