Roja Selvamani : ఎడ్ల బండిపై రోజా.. జబర్దస్త్ పోజులు

Tue, 04 Oct 2022-6:07 pm,

రోజా ఇప్పుడు తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తోంది. సినిమా జీవితానికి రోజా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే దసరా ఈవెంట్ కోసం మల్లెమాల గడప తొక్కేశారు.

ఎడ్ల బలప్రదర్శన పోటీలను తిలకిస్తూ మంత్రి రోజా ఇలా కనిపించారు. రోజా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మన సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరీ వెంకట నాగేశ్వరరావు గారు నిర్వహించడం చాలా అభినందనీయం అని రోజా చెప్పుకొచ్చింది.

 

తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుగారితో పాటు రోజా పాల్గొంది.

రోజా ప్రస్తుతం తన రాజకీయ పనులతోనే బిజీగా ఉంటోంది. అయితే దసరా ఈవెంట్ కోసం బుల్లితెరపైకి గెస్టుగా వచ్చింది. కానీ ఇప్పుడు రోజా తణుకులో సందడి చేస్తోంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link