Salary Hike News: ఉద్యోగులకు బొనంజా.. భారీగా జీతాలు పెంపు.. ఎప్పుడంటే..?

Sun, 06 Oct 2024-10:14 am,

జూలై, ఆగస్టు నెలల్లో 40 ఇండస్ట్రీలకు చెందిన 1,176 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ సర్వే రిపోర్ట్‌ను తయారు చేశారు.   

ఇంజినీరింగ్‌, తయారీ, రిటైల్‌ పరిశ్రమల్లో వేతనాలు 10 శాతం, ఆర్థిక సంస్థల్లో జీతాలు 9.9 శాతం పెరుగుతాయని సర్వేలో తేలింది.  

ఈ సర్వే నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది ప్రైవేట్ ఉద్యోగుల జీతం యావరేజ్‌గా 9.5 శాతం పెరుగుతుందని అంచనా వేస్తనన్నారు. 2025లో తయారీ, రిటైల్‌లో 10 శాతం, ఫైనాన్షియల్ కంపెనీలలో 9.9 శాతం పెరుగుదల ఉండవచ్చు.   

గ్లోబల్ కాంపిటెన్స్ సెంటర్, టెక్నాలజీ ప్రొడక్ట్‌లు 9.9 శాతం, ప్లాట్‌ఫారమ్‌ల ఉద్యోగులు 9.3 శాతం వరకు శాలరీ హైక్ పొందవచ్చని చెబుతున్నారు.   

ఇక టెక్నాలజీ కౌన్సెలింగ్, సేవా రంగంలో జీతంలో 8.1 శాతం వరకు పెరుగుదల ఉంటుందని అంటున్నారు.   

అదేవిధంగా వచ్చే ఏడాది అట్రిషన్ రేటు తగ్గుతుంది. ఈ రేటు 2022లో 21.4 శాతం ఉండగా.. 2023లో 18.7 శాతానికి తగ్గింది.   

ప్రస్తుత సంవత్సరంలో 16.9 శాతంగా అంచనా వేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link