Samantha: ఆ మూడేళ్లు నిప్పుల్లో నడిచినట్లు అనిపించింది.. విడాకులు గురించి సమంత..

Tue, 16 Jul 2024-7:38 pm,

గత మూడు నాలుగు ఏళ్లలో స్టార్ బ్యూటీ సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య తో విడాకుల నుంచి కోలుకుంటూనే.. మరొకవైపు మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బందులు పడ్డారు.   

కానీ ఇప్పుడు జీవితంలో ఏదైనా మార్చుకోగలిగితే మార్చుకుంటారు అని అడిగితే మాత్రం లేదు అని చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత గత మూడు నాలుగుగేళ్లలో తన జీవితం.. నిప్పుల్లో నడిచినట్లు అనిపించింది అంటూ చెప్పడం.. ఫాన్స్ కి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.  

"అందరి జీవితాల్లోనూ కొన్ని మార్చుకోగలిగితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా నేను అనుభవించినవి అన్ని అవసరమా అని అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం నా జీవితంలో నేను ఏది మార్చాలి అనుకోను. ఈ మధ్యనే నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ గత మూడేళ్లుగా నా జీవితంలో జరిగింది జరగకపోయి ఉంటే బాగుండేది అని అన్నాను. కానీ ఇప్పుడు మన లైఫ్ మనకి ఏమిస్తే అది తీసుకోవాలి అనుకుంటున్నాను" అని అన్నారు సమంత.

"కానీ ఎంత కష్టమైనా కూడా, మీరు బయటకు వస్తే చాలు. మీరు గెలిచినట్టే. నాకు ఇంతకుముందు ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఉంది. ఎందుకంటే నేను ఇక్కడిదాకా రావడం కోసం నిప్పుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు సమంత.  

ఇక సినిమాల పరంగా సమంత ఆఖరిసారిగా ఖుషి సినిమాలో కనిపించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే హిట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ చేస్తున్న సమంత తెలుగులో స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా నటిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link