School Teachers: పాఠశాల దుర్మార్గ చర్య.. హోం వర్క్‌ చేయలేదని పిల్లల బట్టలిప్పి శిక్ష

Fri, 18 Oct 2024-5:07 pm,

విద్యార్థులపై ప్రైవేటు పాఠశాల దారుణానికి పాల్పడింది. చిన్నారులపై కర్కశంగా వ్యవహరించింది.

మేడ్చల్ జిల్లాలోని  పూడూరు గ్రామంలోని సెయింట్‌ మేరిస్ పాఠశాల నిర్వాహకులు చిన్నారులను కఠినంగా శిక్షించారు.

హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను చొక్కాలు వినిపించి మోకాళ్లపై కూర్చోబెట్టిన పాఠశాల యాజమాన్యం.

దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను భారీ శిక్ష వేశారు.

దసరా సెలవులు ముగిసి తిరిగి పాఠశాలకు వచ్చినా హోం వర్క్‌ పూర్తి చేయకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చిన ఆందోళన చేపట్టారు.

విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్న దృశ్యాలను కవరేజ్ చేస్తున్న మీడియా సెల్‌ ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసిన పాఠశాల సిబ్బంది. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link