Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..

Fri, 14 Jun 2024-10:31 am,
Shilpa Shetty

శిల్పా శెట్టి ఈ పేరు గురించి తెలుగు ఆడియన్స్  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం.

Yogasanas

మధ్యలో సినిమాలకు దూరమైనా.. తన యోగాసనాలతో అభిమానులకు ఎపుడు దగ్గరగానే ఉంది. ఏజ్ 50 యేళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీరాకృతితో అలరిస్తూనే మెస్మరైజ్ చేస్తోంది ఈ మంగళూరు భామ.

ఆ సంగతి పక్కన పెడితే.. శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త పై ఛీటింగ్ కేసు నమోదు అయింది.  ఆమె భర్త రాజ్ కుంద్రాపై బోగస్ గోల్డ్ స్కీమ్ పథకంతో తమను మోసం చేసినట్టు ఓ బిజినెస్ మ్యాన్ చేసిన కంప్లైంట్ ఆధారంగా ముంబై స్పెషల్ సెషన్స్ జడ్జ్ ఎన్.పి.మెహతా ఆదేశాల మేరకు  ముంబై పోలీసులు శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు చేసారు. 

శిల్పా శెట్టి దంపతులు కొత్తగా స్థాపించిన సత్ యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని టూ బోర్డ్ మెంబర్స్.. ఒక ఎంప్లాయి కలిసి బంగారం మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటంతో కోర్టు వారిపై కేసు నమోదుకు ఆదేశించారు

శిల్పాశెట్టి విషయానికొస్తే.. రీసెంట్ గా  ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో  మెప్పించింది.

పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పాకు మంచి అనుబంధమే ఉంది. శిల్పాశెట్టి.. టాలీవుడ్‌లో వెంకటేష్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'సాహసవీరుడు సాగరకన్య' మూవీతో పరిచయమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link