Sri Reddy: శ్రీ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది.. ? కారణం ఆ హీరోనేనా..!

Wed, 31 Jul 2024-12:27 pm,

Sri Reddy: శ్రీరెడ్డి అప్పట్లో సినీ నటుడు జనసేనాని  పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. తాజాగా ఈమె తన మానసిక స్థితి ఏమి బాగాలేని, మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది.

అంతేకాదు తాను ఎపుడు సాధారణ స్థితికి వస్తానో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. ఇక తనను ఆ భద్రకాళియే కాపాడాలంటూ పోస్ట్ పెట్టింది.

శ్రీరెడ్డి మొదటగా.. సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తో ప్రైవేటుగా గడిపిన దృష్యాలను బయటపెట్టడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అప్పటి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం మొదలు పెట్టింది.

అంతేకాదు అప్పట్లో తనకు న్యాయం చేయాలంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి సంచలనం రేపింది శ్రీరెడ్డి. 

గత కొన్నేళ్లుగా తనకు ఎక్కువగా సూసైడ్ థాట్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. తనను తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన, మీడియా టార్గెట్ చేసి మరి టార్చర్ పెడుతున్నట్టు పేర్కొంది.

వీళ్ల టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తన లేఖలో పేర్కొంది. తాను ఇంకా ఎన్ని రోజులు బతికి ఉంటానో కూడా తెలియదని శ్రీరెడ్డి  పేర్కొంది.

 

తాను వీటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కానీ పరిస్థితులు చూస్తుంటే బయటకు వచ్చే పరిస్థితులు కనబడటం లేదని తెలిపింది.

తన ఈ స్థితిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారని తెలుసుని శ్రీరెడ్డి పేర్కొంది. అంతేకాదు వైపీపీ కూడా తనను తమ కార్యకర్తగా కూడా భావించడం లేదంటూ చివరగా చురకలు అంటించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link