Unlock4: తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి.. గైడ్‌లైన్స్ ఇవే

Mon, 21 Sep 2020-9:41 am,

అన్‌లాక్‌-4లో భాగంగా యూపీలోని తాజమహాల్ (Taj Mahal), ఆగ్రాఫోర్ట్ ఈ రోజు నుంచి (సెప్టెంబరు 21) యాత్రికులకు కనులవిందు చేయనున్నాయి. 

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తాజ్ మహల్, ఆగ్రా కోటను సందర్శనకు యాత్రికులకు అనుమతిస్తున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ పేర్కొంది. 

కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు.  

అయితే ఈ రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. 

ముందుగా.. యాత్రికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. మాస్క్లులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ మేరకు అధికారులు యాత్రికులకు ఎలక్ట్రానిక్ టికెట్లను జారీ చేసి.. ఎప్పటికప్పుడు తాజ్ మహల్, పోర్ట్ పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link