Rashmika Mandanna: ఇలా ఏడుస్తూ ఉండాలా.. ఏం చేయాలో చెప్పండి..రష్మిక షాకింగ్ కామెంట్స్!

Thu, 01 Aug 2024-8:43 pm,

నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో..సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ రష్మిక. ఆ తరువాత విజయ్ దేవరకంగా చేసిన గీతా గోవిందం చిత్రం ద్వారా.. సూపర్ సక్సెస్ అందుకుంది. గీతగోవిందం సినిమా తర్వాత నుంచి రష్మికకి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అంతేకాకుండా రష్మిక అప్పటినుంచి..విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అని రూమర్స్ కూడా వచ్చాయి.  

ఇక ఈ రూమర్స్ గురించి పక్కన పెడితే.. సినిమాలపరంగా మాత్రం రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక సౌత్ లోనే కాకుండా పుష్ప.. సినిమాతో నార్త్ లో కూడా ఫేమ్ తెచ్చుకునింది. ఈ పాన్ ఇండియా సినిమాతో రష్మికకి.. బాలీవుడ్ లో కూడా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దానికి తగ్గట్టు ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమా కూడా రష్మికకు మంచి సక్సెస్ అందించింది.  

ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తున్న రష్మిక చేతులో.. ఇంకా పుష్ప 2 చిత్రం.. అలానే యానిమల్ పార్క్.. సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ పీరియడ్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   

తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక.. తాను పీరియడ్స్ వల్ల భరించలేని నొప్పి వస్తోంది.. అయినా ఓర్చుకుంటున్నా.. ఇది తగ్గాలంటే ఏం చేయాలంటూ అభిమానులకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చింది. 1. ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌ తినాలా? 2. ఎవరినైనా లాగి కొట్టాలా.? 3. లేకపోతే మైండ్‌ను డైవర్ట్‌ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా ? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా.? అని ప్రశ్న అడిగింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link