Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..

Thu, 15 Aug 2024-10:21 am,

ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మాసం నవంబర్‌ నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల కోటా ఇతర షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. టిక్కెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో కూడా చేసుకోవచ్చు.  

శ్రీవారి ఆర్జిత సేవలను ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల నుంచి ఆగష్టు 19 నుంచి 21 వరకు అందుబాటులో ఉంచనుంది. ఆ మరుసటి రోజు ఆగష్టు 22వ తేదీ ఉదయం కల్యాణం, ఉంజాల్‌ సేవ, ఆర్జిజ బ్రాహ్మత్సవం బుక్‌ చేసుకోవచ్చు. అదేరోజు, మధ్నాహ్నం 3 గంటల నుంచి సహస్ర దీపాళంకరణ సేవ, వర్చూవల్‌ సేవ టిక్కెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.  

అంగప్రదక్షిణం టిక్కెట్లను ఆగష్టు 23 ఉదయం 10 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. దర్శనం, వసతి గదులుకు సంబంధించిన శ్రీవారి ట్రస్ట్‌ డోనర్స్ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది.  సీనియర్‌ సిటిజెన్లు, దివ్యాంగుల కోటా అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచునున్నారు.  

ఇక ప్రత్యేక దర్శనం రూ.300 టిక్కెట్లను ఆగష్టు 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచునున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి గదుల వసతికి కూడా బుకింగ్స్‌ సౌకర్యం కల్పించనున్నారు.  

 ఆగష్టు 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి నవనీత సేవ, పరకామణి సేవ మధ్యాహ్నం 1 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link