IPL 2020: ఈ ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే

Sat, 19 Sep 2020-8:17 pm,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ముందుగా గుర్తొచ్చేంది గ్రాండ్  ఓపెనింగ్ సెర్మనీ. కానీ ఈ సారి కోవిడ్-19 వల్ల దాన్ని మనం మిస్ అయ్యాం. 

క్రికెట్ లో  చీర్ లీడర్స్ పరిచయం అయింది ఐపీఎల్ తో మాత్రమే. అలాంటి ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఈ సారికనిపించక పోవడం కాస్త ఫీల్ అయ్యే విషయమే. 

ఐపీఎల్ అంటే ప్రేక్షకుల సందడి ఉంటుంది. స్టాండ్స్ లో ఉన్న  వేలాది మంది ప్రేక్షకుల సందడిని చూసి ఇంట్లో వీక్షించే లక్షలాది మంది ప్రేక్షకులకు జోష్ వచ్చేది. ఈ సారి అది కూడా మిస్సింగ్ లిస్ట్ లో చేరింది.

ఫీల్డ్ కు బయట.. బౌండరీకి సమీపంలో, పెవిలియన్ లో ఇలా పలు చోట్ల క్రికెట్ సాంకేతిక టీమ్ ను చూడటం అనేది ఆటలో అలవాటుగా మారిపోయింది. కానీ ఈ సారి అలాంటి కొన్ని సీన్స్ కనిపించవు.

మ్యాచుకు ముందు మ్యాచు తరువాత మీడియాతో టీమ్ కెప్టెన్లు చాట్ చేసేవాళ్లు. రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. ఈ సారి అది మిస్ అవుతాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link