TRAI Action: TRAI దెబ్బకు ధరలను భారీగా తగ్గించేసిన జియో, ఎయిర్టెల్ .. ఇక ఆ రీఛార్జీ ప్లాన్స్‌ మరింత చీప్‌..

Mon, 27 Jan 2025-3:18 pm,
Jio Voice plans

ఇటీవల జియో పరిచయం చేసిన వాయిస్ ఎస్ఎంఎస్ రీఛార్జ్ ధరలను భారీగా తగ్గించేసింది. Trai ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని ప్లాన్లను రివ్యూ చేసింది. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. దెబ్బకు ప్రైవేటు టెలికాం కంపెనీలన్నీ రీచార్జ్ ప్లాన్లను తగ్గించేసాయి.  

Trai

Trai ఆదేశాల మేరకు జియో, ఎయిర్టెల్ , వీఐ కొత్త ప్లాన్లను కాల్స్ ,ఎస్ఎంఎస్ ల కోసం వినియోగించుకునే కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది డేటా ఉపయోగించలేని కస్టమర్లకు ఎంతో ఉపయోగకరం. అయితే మొన్నటి వరకు డేటా ఉపయోగించలేని కస్టమర్లు కూడా ఎక్కువ మొత్తంలో డేటాకు కూడా డబ్బులు చెల్లించి ప్యాక్‌ కొనుగోలు చేయాల్సి వచ్చేది.  

Jio 1748

జియో 1748 .. జియో అందిస్తున్న ఈ రూ. 1748 ప్లాన్ ధర గతంలో రూ. 1958కి అందించేది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 3600 ఎస్ఎంఎస్ లు కూడా ఏడాదిపాటు వ్యాలిడిటీ అందించేది. అయితే ట్రై ఆదేశాల మేరకు జియో కొత్త ప్లాన్ ధరలను కూడా తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ ధర రూ.1748 ఈ ప్లాన్ లో 336 రోజులు వ్యాలిడిటీతో పాటు 3600 ఎస్ఎంఎస్ లు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు.

జియో రూ.448 ప్లాన్.. జియో మరొక ప్యాక్ ను కూడా తగ్గించేసింది .రూ.458 ఉండే ప్లాన్‌ రూ. 448 రూపాయలకు మాత్రమే. ఈ రీఛార్జీ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 1000 ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ కూడా తమ రీఛార్జ్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చేసింది

ఇటీవల ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 499 కానీ ట్రై ఆదేశాల మేరకు రూ.469 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అంటే రూ. 30 రూపాయలు తగ్గించేసింది.  ఇది కాకుండా జియో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కూడా రూ.1959కి అందుబాటులో ఉండే ప్రస్తుతం దీన్ని రూ.1849 కి తగ్గించింది అంటే ఏకంగా ఈ ప్లాన్ పై రూ.110 రూపాయలు ఎయిర్టెల్ తగ్గించేసింది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link