Triptii Dimri: పైట జార్చి పరువాలు ఒలకబోస్తున్న తృప్తి డిమ్రి.. ఈ డోస్ మాములుగా లేదుగా..

Wed, 23 Oct 2024-2:39 pm,

తృప్తి డిమ్రీ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 8 యేళ్ల వరకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. గతేడాది తెలుగు దర్శకుడు  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రంతో  ఓవర్ నైట్ పాపులారిటీ వచ్చేసింది.

 

యానిమల్ చిత్రంలో తృప్తి  హాట్ స్కిన్ షోకు ఆడియన్స్  ఫిదా అయ్యారు. దీంతో ఈ భామను ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం  పెరిగింది. రీసెంట్ గా ‘బ్యాడ్ న్యూస్’ తో  మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తృప్తి నటించిన ఈ బూతు చిత్రానికి  దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ సైతం నోరెళ్ల బెట్టారు.

అంతేకాదు తృప్తి.. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తోన్న స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ‘ది రాజా సాబ్’మూవీతో తెలుగులో అడుగు పెట్టబోతుంది. మరవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ తృప్తి కోసమే  స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.   

తృప్తి విషయానికొస్తే.. 2017లో శ్రీదేవి టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన  ‘మామ్’ మూవీలో చిన్న పాత్రతో  వెండితెర తెరంగేట్రం చేసింది.  ఆ తర్వాత సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ చిత్రంతో ప్రమోషన్ పొందింది.  

2021లో  ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో తృప్తి డిమ్రి  పేరు చేరింది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

ఇక 2018లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో యాక్ట్రెస్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు తృప్తికి ఫేమ్ ను పెంచాయి.  ఇక ‘యానిమల్’ సినిమాతో మాత్రం తృప్తికి ప్యాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link