Gudiko Gomata: ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

Fri, 11 Dec 2020-2:42 pm,

హిందూ సనాతన ధర్మంలో ఆవుల రక్షణ, గోపూజకు ప్రత్యేక స్థానం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లాల్లోని ఐదు నుంచి పది దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోవులను దానం చేయాలని నిర్ణయించిందని తెలిపారు.  

గుడికో గోమాత కార్యక్రమాన్ని మరింతగా అమలు చేయడానికి ఆవులను టీటీడీకి దానం చేయాలని వైవీ సుబ్బారెడ్డి భక్తులను కోరారు. త్వరలో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచారం పరిషత్ సభ్యులు హాజరయ్యారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link