Curd Benefits: రోజూ మద్యాహ్నం లంచ్‌లో పెరుగు ఎందుకు తినాలి, ఏమౌతుందో తెలుసా

Sat, 14 Sep 2024-8:41 pm,

జీర్ణక్రియ మెరుగుదల

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్ బ్యాక్టీరియాను పెంచడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మద్యాహ్నం లంచ్‌లో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మల బద్ధకం, అజీర్తి ఇతర కడుపు సమస్యలు తొలగిపోతాయి.

ఇమ్యూనిటీ పటిష్టం

పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ , విటమిన్ల కారణంగా శరీరం ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. రోజూ నిర్ణీత మోతాదులో పెరుగు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. 

స్కిన్ అండే హెయిర్ కేర్

పెరుగు రోజూ తీసుకోవడం వల్ల చర్మం, కేశాలకు చాలా ఉపయోగం. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపు ఇస్తాయి. కేశాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

బరువు నియంత్రణ

పెరుగులో ఉండే ప్రోటీన్లు, ఫ్యాట్స్ కారణంగా దీర్ఘకాలం కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. ఆకలి తగ్గుతుంది. కేలరీలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. 

ఎముకలు, పళ్లకు ప్రయోజనం

పెరుగులో కాల్షియం అనేది కీలకం. ఎముకలకు, పళ్లకు చాలా లాభం. మహిళలు, వృద్ధులకు కాల్షియం చాలా అవసరం. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు చాలా లాభదాయకం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link