World Largest Cemetery: ప్రపంచంలో అతి పెద్ద శ్మశానమిదే, ఇక్కడ ఖననం కోసం ప్రార్ధనలు చేస్తుంటారంటే నమ్ముతారా

Thu, 27 Jul 2023-2:34 am,

గతంలో షియా ముస్లింలు తరచూ ఇక్కడికి సందర్శించేవారు. తామెవరైనా మరణిస్తే ఇదే శ్మశాన వాటికలో ఖననమయ్యేలా చేయాలని ప్రార్ధనలు చేస్తుంటారు. ఈ శ్మశాన వాటిక విస్తీర్ణం పెరిగే కొద్దీ స్థలం లోటు ఏర్పడసాగింది. ఖననం చేయాల్సినవి పెరిగిపోతున్నాయి. 2013లో అంటే పదేళ్ల ముందుతో పోలిస్తే ఇవాళ ఈ శ్మశాన వాటికలో ఖననం ఖర్చు 5 మిలియన్ ఇరాకీ దీనార్లు. 

ఈ శ్మశాన వాటికలో లక్షలాదిమంది ఖననమయ్యారు. షియా ముస్లింలు తమ కుటుంబీకులు లేదా బంధువుల్ని ఇక్కడే ఎందుకు ఖననం చేయాలనుకుంటారనే విషయం ఆసక్తి కల్గిస్తుంది.

మీడియా నుంచి వచ్చే కథనాల ప్రకారం ఈ శ్మశాన వాటికలో రోజుకు 200 కంటే ఎక్కువ మృతదేహాలకు ఖననం జరుగుతుంటుంది.

ఇరాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్స్ వచ్చినప్పటి నుంచి ఈ శ్మశాన వాటిక పెరుగుతూ వస్తోంది. 

ఈ శ్మశాన వాటిక పేరు వాదీ అల్ సలామ్. దీనర్ధం వ్యాలీ ఆఫ్ పీస్ అంటే శాంతి లోయ అని వస్తుంది. ఈ నగరం షియా ముస్లింలకు ప్రత్యేకమని చెప్పాలి. అందుకే షియా ముస్లింలు తమ వారెవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేయాలని భావిస్తుంటారు

ఇరాక్ దేశస్థులు తమ సమీప బంధువులు కావల్సిన వారిని ఒకే చోట ఖననం చేస్తుంటారు. ఇది కాలక్రమంలో అతిపెద్ద శ్మశాన వాటికగా మారిపోయింది. 

ఇరాక్ దేశంలోని నజఫ్ పట్టణంలో ఉన్న ఈ ఇస్లామిక్ సాంప్రదాయ శ్మశాన వాటిక ప్రపంచంలోనే అతిపెద్దది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link