Bihar girl Attempting suicide on railway track: కొంత మంది ప్రతిచిన్న విషయానికి అతిగా స్పందిస్తుంటారు. ఎగ్జామ్ పాస్ కాలేదని, ప్రేమించిన అమ్మాయితొ పెళ్లికాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇంట్లో గొడవలు జరిగాయని, నాన్న తిట్టాడని, అన్నయ్య కొట్టాడని సూసైడ్ లు చేసుకుంటారు. కడుపునొస్తుందని, పెళ్లి ఆలస్యమౌతుందని కూడా ఇటీవల కాలంలో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ క్రమంలో కేవలం  ఆసమయంలో కోపం వల్ల.. కఠినమైన డిసిషన్స్ తీసుకుని, తమ జీవితాల్ని మధ్యలోనే ముగించేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా మంది రైల్వే పట్టాల మీద వెళ్లి రన్నింగ్ ట్రైన్ కుఎదురుగా వెళ్తున్నారు. మరికొందరు పట్టాల మీద పడుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


బీహర్ లో ఒక అనుకొని ఘటన చోటు చేసుకుంది. చకియా రైల్వే స్టేషన్ లో ఒక యువతి.. రైల్వే పట్టాల మీదకు చేరుకుంది. అంతేకాకుంకా.. పట్టాల మీద పడుకుంది. ఆమె ఎంత సేపు ఎదురుచూసిన కూడా రైలు రాలేదు. దీంతో ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడు.. అదే మార్గంలో... మోతీహరి నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్తున్న రైలు అక్కడికి చేరుకుంది.


Read more: Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్.. 


సదరు యువతిని .. రైలు డ్రైవర్ గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ లు వేశాడు. దీంతో ఆ రైలు కాస్తంతా దూరంలో  ఆగిపోయింది. అప్పుడు అక్కడున్న వారు.. యువతిని రైల్వే పట్టాల నుంచి పక్కకు లాగారు. తనకు జీవితం మీద ఆశలేదని, తనను ఆపోద్దని  అక్కడి వారితో యువతి వాగ్వాదానికి దిగింది. కానీ అక్కడున్న వారు.. రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రైలు డ్రైవర్ గమనించడంతో.. యువతి ప్రాణాలతో బైటపడింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.