Pune family wearing 25 kgs gold and came to Tirumala for lord Balaji darshan: ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  చాలా మంది ప్రతినెల ఎంతో కొంత డబ్బులు పొదుపు చేసీ మరీ బంగారం ను తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇంకొందరు అయితే.. బంగారం కోసం చిట్టీలు వేయడం లేదా బిజినెస్ లు సైతం చేస్తుంటారు. ఇంకా మహిళలకైతే బంగారం ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్ వచ్చిన కూడా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఒంటి మీద ప్రతిదీకూడా గోల్డ్ అయి ఉండాలని భావిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. సాధారణంగా బంగారం ఉన్నవాళ్లకు కొంత మందికి ఒక వెరైటీ అలవాటు ఉంటుంది. తమ వద్ద ఉన్న బంగారంను అందరికి చూపించాలనుకుంటారు. మరికొందరు బంగారం వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు. ఒంటిపై బంగారం ధరించి, తమ వాళ్ల ముందే తమ స్టేటస్ ను ప్రత్యేకంగా చూపించాలనుకుంటారు. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్ లు జరిగిన, టెంపుల్స్ లకు వెళ్లిన కూడా  గ్రాండ్ గా బంగారం ధరించి మరీ వెళ్లిపోతుంటారు. అయితే.. ఇక్కడ కూడా ఒక గోల్డ్ వేసుకున్న ఫ్యామిలీ తిరుమలలో హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.


పూర్తి వివరాలు..


తిరుమలలో పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే.. వారు స్వామి వారిని ఉదయం పూట దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ తో పాటు.. మరో మహిళ సైతం ఉన్నారు. వారి ఒంటి మీద దాదాపు.. 25 కేజీల బంగారం ధరించినట్లు తెలుస్తుంది.నెక్లెస్ లు, కంకణాలు, వడ్డాణాలు, భారీ చైన్ లు, ఉంగరాలు.. ఇలా ప్రతీదీ కూడా బంగారంతో ఉన్నాయి. అవి కూడా కేజీల కొద్ది బంగారంతో చేసినవి ఉన్నట్లు తెలుస్తోంది.


మొత్తంగా వారి ఒంటి మీద దాదాపు..రూ. 15 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. వీరి చుట్టుపక్కల పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది సైతం ఉన్నారంట. వీరు ఆలయంకు వచ్చిన కారు కూడా గోల్డ్ కలర్ లో ఉండటం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో పూణేకు చెందిని  గోల్డ్ మెన్ ఫ్యామిలీని చూసేందుకు అక్కడి వారు ఆసక్తి చూపించారు. అంతేకాకుండా.. వారితో సెల్ఫీలు దిగేందుకు సైతం పోటీపడ్డారు.


Read more: Venomous Snake: ఎర్రటి చీరలో వయ్యారంగా పామును పట్టేసిన యువతి.. వీడియో వైరల్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ లు బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ రంగంలో అనేక బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. వీరిద్దరు తరచుగా సల్మాన్ ఖాన్,  వివేక్ ఒబెరాయ్ వంటి బాలీవుడ్ ప్రముఖుల చుట్టు కన్పిస్తుంటారు.  అంతేకాకుండా.. వీరిద్దరూ పూణేలో గోల్డెన్ గైస్ అనే ఎన్జీవోను కూడా నడుపుతున్నట్లు తెలుస్తోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.