Flood on Mars: అంతరిక్షం గురించి భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు తెలిసింది గోరంత . తెలియాల్సింది కొండంత. కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి వారు నిత్యం  ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఒక పరిశోధకులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. మార్స్ గురించి వారికి విస్మయం కలిగించే విషయాలు తెలిసాయట. అయితే అలాంటి వార్త  కోసం తాము ఎన్నో రోజులుగా సిద్ధం అవుతున్నాం అని.. ఇప్పటికి తెలిసింది అన్నారు. మరి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు


అంగారకుడిపై జీవం ఉందో లేదో కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్న క్రమంలో వారికి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే కుజ గ్రహంపై ( Mars ) భూ మధ్యరేఖలో సుమారు 4 బిలియన్ల సంవత్సరాల క్రితం అతి భయంకరమైన వరద వచ్చిందట. వీటికి సంబంధించిన జాడలు కూడా శాస్త్రవేత్తలకు లభించాయట. దీన్ని బట్టి అంగారకుడిపై జీవం ఉండే అవకాశం ఉంది అనే వారి వాదనకు మరింత బలం చేకూరుతోంది.


సైంటిఫిక్ రీపోర్ట్ అనే జర్నల్ లో ఈ నివేదికను ప్రచురించారు. ఈ పరిశోధలో తెలిసింది ఏంటంటే అంగారుకుడిపై ఒకప్పుడు మంచు ( ICE ) ఉండే అవకాశం ఉందట. అయితే ఉల్కాపాతం వల్ల అక్కడి మంచు కరిగిపోయి ఉండవచ్చట. ఇదంతా సుమారు 4 బిలియన్ల సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.



Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR