కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. గతంలో పలు సామాజిక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రకాష్ రాజ్ ..ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోనని..ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రటటించిన ప్రకాశ్ రాజ్ ..తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో విశేష అభిమానులు ఉన్న ప్రకాశ్ రాజ్.. ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగాం  ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తన అభిమానులకునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.