సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే వ్యక్తుల్లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఈ మాజీ టీమిండియా క్రికెటర్ ఒక ట్వీట్ చేసి యావత్ దేశాన్ని ఆలోచింపజేసేలా చేసాడు.  తండ్రి, తల్లి, కూతురుతో ఉన్న ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సెహ్వాగ్.. "ట్రిపుల్ సెంచరీ ఒకే, కానీ ట్రిపులింగ్ వద్దు.. ప్లీజ్. బేటీకో బచావో.. హెల్మెట్ ధరించండి, ప్రోత్సహించండి" అని పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, ఈ ఫొటోలో ఉన్న యువ‌తి బైక్ పై తనకు కూర్చోవడానికి సరిపడా చోటు లేకున్నా ప్ర‌మాద‌క‌ర స్థితిలో కూర్చుంది. కిందకుపడకుండా ముందున్న తల్లిని గ‌ట్టిగా ప‌ట్టుకుంది. ఈ ట్వీట్‌ ను పలువురు నెటిజన్లు స్వాగతించారు.