Viral news: తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మూడేళ్లు కష్టపడి తనకు ఎంతో ఇష్టమైన బజాజ్ డామినర్​ 400 బైక్​ కొనుగోలు చేశాడు. బైక్ విలువ రూ.2.6 లక్షలు. ఇందులో వింతేముంది? ఎవరైనా తమకు కావాల్సిన బైక్​, వస్తువుల కోసం కష్టపడి కొనడం సహజమే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ యువకుడు డబ్బు చెల్లించిన విధానం గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ యువకుడు మూడేళ్లుగా రూపాయి నాణేలను దాస్తూ.. బైక్​ కోసం పొదుపు చేశాడు. అలా బైక్ కొనేందుకు అవసరమైన రూ.2.6 లక్షలను కేవలం కాయిన్ల రూపంలోనే చెల్లించాడు.


తమినాడు అమ్మాపేట్​లోని గాంధీ మైదాన్​లో ఉండే వి భూపతి అనే 29 ఏళ్ల యువకుడు తనకు ఎంతో ఇష్టమైన డామినార్ బైక్ కొనేందుకు పైసా.. పైసా (కాయిన్ల రూపంలోనే) కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని గొనె సంచుల్లో మూటగట్టి.. ఈ నెల 26న సేలంలోని బజాజ్ షోరూంకు తీసుకెళ్లాడు. స్నేహితుల సహాయంతో మినీ వ్యాన్​లో ఆ సంచులను తరలించాడు. ఆ కాయిన్లతోనే బైక్​ కొనేందుకు సిద్ధపడ్డాడు. అందుకు షోరూం అధికారులు కూడా అంగీకరించడంతో.. ఆ కాయిన్స్ మొత్తాన్ని షోరూంలో పోశారు.


దీనితో ఆ షోరూం స్టాఫంతా కాయిన్లను లెక్కబెట్టే పనిలో నిమగ్నమైంది. మొత్తం లెక్కించే సరికి గంట సమయం పట్టింది.


ఆ యువకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించిన డబ్బును ఆదా చేసి.. బైక్​ కోసం దాచాని వెళ్లడించాడు. డామినోర్ బైక్ ఆన్​ రోడ్​ ధర గురించి కనుక్కోగా రూ.2.6 లక్షలుగా తెలిసందని చెప్పాడు. ఆ మొత్తం జమైన వెంటనే బైక్ షోరూంకు వెళ్లినట్లు వివరించాడు.



నెటిజన్ల ప్రశంసలు..


ఇప్పుడు ఈ అంశం చర్చనీయంశంగా మారింది. ఎంతో మంది దీనిపై మాట్లాడుకుంటూ.. చాలా మంది తమ ఆశయాలు నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారని.. కాని కొందరు దానిని కాస్త క్రేజీగానే నెరవేర్చుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ యువకుడు తనకు ఇష్టమైన బైక్ వినూత్నంగా కొని.. ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.