Jupiter Nakshatra Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల్లో జరిగే మార్పులు అన్ని రాశులవారిపై శుభ, అశుభ ప్రయోజనాలను కలిగిస్తాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశి సంచారం చేస్తాడు. అయితే ఈ సంవత్సరం బృహస్పతి సంచారం చేసింది. గ్రహాలు సంచారం చేసే క్రమంలో నక్షత్రాలు కూడా మారుతాయి. గురు గ్రహం  21 జూన్ 2023 మధ్యాహ్నం 01.19 గంటలకు మేష నక్షత్రం భరణి రెండవ దశలోకి ప్రవేశించింది. ఈ గ్రహం 27 నవంబర్ 2023 వరకు ఈ స్థితిలో ఉంటుంది. ఈ గ్రహం తర్వాత అశ్వినీ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే నక్షత్రం మారడం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై అశ్వినీ నక్షత్ర ప్రభావం:
మేషరాశి:

బృహస్పతి ఐదవ స్థానం ప్రవేశించి, భరణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మేషరాశి వారికి అదృష్టం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్‌ లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి కష్టపడి పనులు చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితం ఈ క్రమంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన తల్లిదండ్రులు మద్దతు లభిస్తుంది. 


Also Read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్


మిథునరాశి:
బృహస్పతి భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఈ క్రమంలో సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గి సంతోషం కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో ఆరు, తొమ్మిదవ స్థానాలకు బృహస్పతి అధిపతి ఉన్నాడు. దీంతో ఈ రాశివారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఇప్పటి కంటే భవిష్యత్‌లో చాలా రకాల లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు కలగుతాయి. 


Also Read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook