యాషెస్‌ సిరీస్‌ : స్టిఫెన్ స్మిత్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో  ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో  ఆసీస్  భారీ స్కోర్ కు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 170/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్.. మరో 327 పరుగులు జోడించింది. ఇంగ్లండ్ బౌలర్లపై ఆసీస్ బ్యాట్స్ మెన్ స్మిత్ చెలరేగడంతో ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి  497 చేసి ఇన్నింగ్ డిక్లేర్డ్ చేసింది. 


స్మిత్‌  (211)కు తోడు గా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌  ( 58 ) లోయరార్డర్‌లో మిచెల్‌ స్టార్క్‌ ( 54 ) అర్ధ సెంచరీలు సాధించడంతో ఆసీస్ కు ఈ మేరకు భారీ స్కోర్ సాధ్యపడింది.  ఇదిలా ఉంటే ఆసీస్ ఇన్నింగ్ డిక్లేర్డ్ తర్వాత  తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్‌ ఆట ముగిసేసరికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న టెస్టు సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే ఇంగ్లండ్ కు స్మిత్ లా రాణించే బ్యాట్స్ మెన్ కావాలి. మరి ఆ స్థాయిలో ఎవరు రాణిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.