విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసిస్ జట్టు కెప్టేన్ ఎరోన్ ఫించ్ బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. భారత జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ మూడు వారాల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతుండగా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, పిషబ్ పంత్, ఎంఎస్ ధోని, డి కార్తిక్, కృనాల్ పాండ్య, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, మయంక్ మర్కండె, జస్ప్రిత్ బుమ్రా వంటి ఆటగాళ్లు భారత్ తరపున బరిలోకి దిగుతున్నారు. 


భారత్ తరపున మయంక్ ఈ మ్యాచ్ ద్వారా తొలిసారి టీ20 ఇంటర్నేషనల్స్‌లోకి అడుగుపెడుతుండగా మరోవైపు ఆసిస్ జట్టు వైపు నుంచి పీటహ్ హ్యాండ్స్‌కంబ్ టీ20 ఇంటర్నేషనల్స్‌లోకి ప్రవేశిస్తున్నాడు.