Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్​(Tokyo olympics)లో భారత్​కు మరో పతకం సాధించింది. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పూనియా(Bajrang Poonia) కాంస్య పతక పోరులో గెలిచాడు.  దీంతో ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కాంస్యపతాక పోరులో కజకిస్థాన్​(Kazakhstan)కు చెందిన నియాజ్​బెకోవ్​ దౌలెత్​ ను 8-0 తేడాతో ఓడించాడు బజరంగ్. ఈ పోరులో బజరంగ్‌ పూర్తిగా ఆధిపత్యం కనబరిచాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు రక్షణాత్మకంగా ఆడుతూనే మరోవైపు దూకుడు చూపించి కాంస్యాన్ని ఒడిసి పట్టాడు.


Also Read: Tokyo olympics: జయహో నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఫస్ట్ గోల్డ్‌మెడల్



 ఎన్నో అంచనాల మధ్య ఫేవరేట్​గా బరిలో దిగిన బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.  అయితే సెమీస్‌లో అతడి డిఫెన్స్‌ బాగా లేకపోవటం కారణంగానే అతడు ప్రత్యర్థికి తలవంచాడు.అయినా.. ఇప్పుడు కంచు పట్టి భారత్​ను తలెత్తుకునేలా చేశాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook