PV Sindhu news: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌(BWF World Tour Finals)లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) సెమీస్​కు దూసుకెళ్లింది. రెండో రౌండ్​లో జర్మనీ ప్లేయర్​ యూవొన్నే లీ(Yvonne Li)తో జరిగిన పోరులో 21-10,21-13 తో వరుస సెట్లలో విజయం సాధించి..సెమీస్(semi-finals)లోకి ప్రవేశించింది. మ్యాచ్  కేవలం 31 నిమిషాల్లోనే ముగిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anju Bobby George: స్ప్రింటర్ అంజూ బాబీ జార్జ్‌కు 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు


పురుషుల సింగిల్స్​ సెకండ్ బీ గ్రూప్​ గేమ్​లో శ్రీకాంత్​(Srikanth) ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్​ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్​ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. బుధవారం జరిగిన తమ మొదటి రౌండ్​లో డెన్మార్క్ క్రీడాకారిణి లినే క్రిస్టోఫెర్సెన్​పై 21-14, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సింధు. ఇక శ్రీకాంత్ ఫ్రాన్స్​కు చెందిన టోమా జూనియర్ పొపోవ్​పై 21-14, 21-16 తేడాతో గెలిచాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook