కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మొత్తం 295 కేజీలు ఎత్తి ఆయన ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, సంచిత చాను స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగా, పురుషుల విభాగంలో గురురాజ్ స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో భారత్‌కు కాంస్యం దక్కడంతో భారత్ పతకాల పట్టికలో మొత్తం నాలుగు మెడల్స్ చేరాయి. చిత్రమేంటంటే.. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని గెలుచుకున్న యంగెస్ట్ వెయిట్ లిఫ్టర్ కూడా దీపక్ రావడం గమనార్హం. ఆ కుర్రాడి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. హర్యానా ప్రాంతానికి చెందిన దీపక్ తొలుత డైవర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తన కోచ్‌ల ఇచ్చిన స్ఫూర్తి మేరకు వెయిట్ లిఫ్టింగ్ విభాగం వైపు ఆసక్తి పెంచుకున్నారు.