హోమిల్టన్ : న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాకు తొలి దెబ్బ తగిలింది. టీ20 సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, అదే జోష్ లో వన్డే సిరీస్ కు సిద్ధమైన భారత్ కు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం కివీస్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయి తొలి ఓటమి చవిచూసింది. భారత్ 347 పరుగులు చేసి కూడా గెలువకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన రనౌట్ కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో జాంటీ రోడ్స్ చేసిన రనౌట్ ను తలపిస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత్ నిర్దేశిచిన 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడింది. ఈ క్రమంలో బుమ్రా వేసిన 29 ఓవర్‌ లో రాస్‌ టేలర్‌ డిఫెండ్ చేసి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే, కవర్స్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి బంతిని అందుకొని బ్యాట్స్‌మన్‌ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ అద్భుతంగా డైవ్ చేస్తూ రనౌట్ చేశాడు. దీంతో అర్థ సెంచరీతో జోరుమీదున్న ఓపెనర్‌ హెన్రీ నికోలస్‌(78) పెవిలియన్ చేరాల్సి వచ్చింది.జాంటీ రోడ్స్ లా తలపించే విరాట్ కోహ్లీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..