వెల్లింగ్టన్: టీమిండియా నిర్దేశించిన 253 ప‌రుగుల విజయ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ జట్టు 38 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. 4వ వన్డే అనంతరం మార్టిన్ వెన్ను నొప్పితో 5వ వన్డేకి దూరం కాగా అతడి స్థానంలో మ్యాచ్‌లోకి వచ్చిన ఓపెన‌ర్ మున్రో (24) పరుగులకే వెనుదిరగగా అనంత‌రం క్రీజులోకొచ్చిన రోజ్ టేల‌ర్ (1) కేవ‌లం నాలుగు బంతులకే హార్థిక్ పాండ్య బౌలింగ్‌‌లో ఔట్ అయి పెవిలియ‌న్ బాటపట్టాడు. దీంతో న్యూజిలాండ్ 11 ఓవ‌ర్ల‌లో 38 ప‌రుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ 46 బంతులు ఎదుర్కుని 25 పరుగులతో, టామ్ లాథ‌మ్ 21 బంతుల్లో 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా 19 ఓవర్లలో కివీస్ 76 పరుగులు చేసింది.


వికెట్ల వేట ప్రారంభించిన భార‌త బౌల‌ర్ల‌లో మహమ్మద్ ష‌మీ రెండు వికెట్లు పడగొట్టగా, హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.